భారతదేశం, ఏప్రిల్ 3 -- ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) లో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలు ఇప్పుడు దేశ రాజధానిలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి యువ ఎంపీ రాఘవ్ చద్దాను ఆప్ నాయకత్వం తొలగించడంపై విపక్షాలు తమ విమర్శలకు పదును పెట్టాయి. పార్టీలో అంతర్గత విభేదాలు ముదిరిపోయాయని, అందుకే చద్దాను పక్కన పెట్టారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి.
ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా ఈ వ్యవహారంపై స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "ఢిల్లీ ఆప్లో కీలక నేతగా ఉన్న రాఘవ్ చద్దాను ఈ విధంగా తొలగించి పక్కన పెట్టడం చూస్తుంటే, ఆయన అరవింద్ కేజ్రీవాల్ అవినీతి, అరాచక నాయకత్వానికి దూరంగా జరుగుతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది" అని ఆయన పేర్కొన్నారు. గతంలో ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు స్వాతి మలివాల్ విషయంలో జరిగినట్లే,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.