భారతదేశం, ఏప్రిల్ 6 -- అనంతపురం జిల్లా యాడికిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. 'జలధార-నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత' కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. నీరు మనందరికీ సర్వస్వం... దానిని సంరక్షించుకోడానికే వంద రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసమే పనిచేస్తున్నామని, పరిగెత్తే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని నిల్వ చేయాలి జలాశయాలు నింపేందుకు ప్రయత్నించాలన్నారు. నీటిని నిల్వ చేసుకుంటే అదే సంపద సృష్టి్స్తుందన్నారు.

ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌లు, తుంపర సేద్యం, సూక్ష్మసేద్యం లాంటి అనేక ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్లామని చంద్రబాబు అన్నారు. పంటకుంటలు, కాలువలు, చెరువుల్లో మట్టి తీసి పొలాల్లో వేశామని చెప్పారు. ఎన్టీఆర్ జలసిరి ద్వారా ట్రెంచ్‌లు, నీరు చెట్టు, నీరు మీరు, నీరు ప్రగతి లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టామన...