భారతదేశం, మార్చి 15 -- తెలంగాణలోని మెయినాబాద్ డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. పాజిటివ్ వచ్చిన వారిలో ప్రముఖులు కూడా ఉన్నారు. దీంతో ఈ కేసు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, మాజీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా 11 మందిని మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో మాదకద్రవ్యాలు వినియోగించారనే ఆరోపణలపై అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాదకద్రవ్యాలు వినియోగించినట్లు తేలింది. అయితే శనివారం నిర్వహించిన ర్యాపిడ్ టెస్టులో టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కు నెగెటివ్ వచ్చింది. కానీ రక్త పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు పోలీసు బృందాన్ని గమనించి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు.

రంగారెడ్డి జిల్లా మెుయినాబాద్ అజీజ్‌నగర్‌లోని ఆ ఫామ్‌హౌస్ మాజీ ఎమ...