భారతదేశం, జూన్ 7 -- జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది మృగశిర కార్తె ప్రవేశం సాధారణమైనది కాదు. ఈ సమయంలో గ్రహాల కదలికలు కొన్ని రాశుల వారి జాతకాలను పూర్తిగా మార్చేయబోతున్నాయి. అసలు మృగశిర కార్తె ప్రాముఖ్యత ఏంటి? ఏయే రాశుల వారికి అపారమైన ధనలాభం కలగబోతోంది? వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడు ఒక్కో నక్షత్రంలోకి ప్రవేశించడాన్ని ఒక్కో కార్తెగా పిలుస్తారు. సూర్యుడు రోహిణి నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రంలోకి అడుగుపెట్టే సమయాన్ని మృగశిర కార్తె అంటారు. మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు (అంగారకుడు). కుజుడు ధైర్యానికి, శౌర్యానికి, భూమికి కారకుడు. సూర్యుడు ఈ నక్షత్రంలోకి రావడం వల్ల వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వస్తాయి. రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించి, వర్షాలు కురవడం ప్రారంభమవుతుంది. "మృగశిర కురిస్తే ముసలెద్దు కూడా రంకె వే...