భారతదేశం, ఆగస్టు 19 -- తమిళనాడులోని సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న మహిళలు మూడో బిడ్డకు జన్మనిచ్చినా సరే, ఏకంగా 365 రోజుల (ఒక సంవత్సరం) పాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను వర్తింపజేయాలని నిర్ణయించింది. మహిళా సాధికారత, సామాజిక సంక్షేమానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగానే ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

రాష్ట్ర శాసనసభలో తన శాఖ పద్దులపై చర్చ సందర్భంగా మానవ వనరుల నిర్వహణ శాఖ మంత్రి డి. శరత్‌కుమార్ ఈ సంచలన ప్రకటన చేశారు. "మాది సామాజిక సంక్షేమం, మహిళా సాధికారతకు అత్యున్నత పీఠం వేసే ప్రజా సంక్షేమ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే మహిళా ఉద్యోగుల మూడో సంతానానికి ప్రస్తుతం ఇస్తున్న 12 వారాల ప్రసూతి సెలవును 365 రోజులకు పొడిగిస్తున్నాం" అని మంత్రి సభ దృష్టికి తెచ్చారు. దీన...