భారతదేశం, జూన్ 6 -- ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులకు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. మార్చి 2026లో జరిగిన ఎస్ఎస్‌సీ పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల వ్యక్తిగత వివరాలలో తప్పులను సరిదిద్దుకునేందుకు బోర్డు అవకాశం కల్పించింది. హెచ్ఎమ్ లాగిన్ ద్వారా ఈ కరెక్షన్లు చేసుకోవడానికి అభ్యర్థుల సౌకర్యార్థం గడువును జూన్ 10, 2026 వరకు పొడిగించినట్లు అధికారిక ప్రకటన వెలువడింది.

ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె. శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల వివరాలను (పేరు, పుట్టిన తేదీ, గ్రూపు, సబ్జెక్టులు, ఫోటో, సంతకం మొదలైనవి) క్షుణ్ణంగా పరిశీలించాలి.

ఏదైనా తప్పులు ఉంటే, నిర్ణీత గడువులోగా (జూన్ 10 లోపు) హెచ్ఎమ్ లాగిన్ పోర్టల్ ద్వారా ఆన్‌ల...