భారతదేశం, ఏప్రిల్ 2 -- మన దేశంలో వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇరుకైన రోడ్లు, అజాగ్రత్తగా నడిపే వాహనదారుల వల్ల కొత్త కార్లపై గీతలు పడే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది.

అందుకే కారు కొన్న వెంటనే దానికి అదనపు రక్షణ కల్పించడం ఒక అవసరంగా మారింది. గతంలో కేవలం ఖరీదైన లగ్జరీ కార్లకు మాత్రమే ఇలాంటి కోటింగ్‌లు చేయించేవారు.

కానీ ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు కొనే సాధారణ కార్లకు కూడా రక్షణ కవచాలు వేయించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కార్ల తయారీ కంపెనీలు ఇచ్చే పెయింట్ నాణ్యత కూడా మారుతున్న తరుణంలో, రీసేల్ వాల్యూ తగ్గకుండా చూసుకోవడానికి యజమానులు ఇలాంటి ఆధునిక మార్గాలను వెతుకుతున్నారు.

ముందుగా పీపీఎఫ్ (Paint Protection Film) గురించి తెలుసుకుందాం. ఇది కారు బాడీపై అతికించే ఒక ప...