భారతదేశం, ఆగస్టు 25 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సేనాధిపతిగా భావించే అంగారక (అంగారకుడు/కుజ) గ్రహ సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. కుజుడి కదలికల్లో మార్పు వచ్చినప్పుడల్లా ద్వాదశ రాశుల జీవితాలపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. జాతకంలో అంగారక గ్రహ ప్రభావం అనుకూలంగా ఉంటే ఆ వ్యక్తికి ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఉత్సాహం అపారంగా పెరుగుతాయి.

ప్రస్తుతం అంగారకుడు బుధుడికి చెందిన మిథున రాశిలో గోచరిస్తున్నాడు. హిందూ పంచాంగం ప్రకారం.. రాబోయే 25 రోజుల పాటు అంటే సెప్టెంబర్ 18 సాయంత్రం వరకు కుజుడు ఇదే రాశిలో కొనసాగుతాడు. ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. మిథున రాశిలో అంగారక సంచారం వల్ల రాబోయే 25 రోజులు ముఖ్యంగా నాలుగు రాశుల వారికి అత్యంత శ్రేష్ఠమైన ఫలితాలు రానున్నాయి.

మిథున రాశిలో అంగారకుడి సంచారం మేష రాశ...