భారతదేశం, జూన్ 10 -- ఎండల తీవ్రత తగ్గి, చల్లని నైరుతి రుతుపవనాలు దేశాన్ని పలకరించే ఆహ్లాదకరమైన సమయం జూన్. ప్రకృతి పరంగా ఇది ఎంతో ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ, సగటు సామాన్యుడికి, అన్నదాతకు మాత్రం ఈ నెల ఆర్థిక భారాల కాలంగా మారుతోంది. "అమ్మో జూన్ నెల వచ్చింది" అంటూ మధ్యతరగతి తల్లిదండ్రులు, పెట్టుబడి సాయం కోసం ఎదురుచూసే రైతులు గుండెలు గుభేలుమనే పరిస్థితి నెలకొంది. చదువులు, సాగు పనులు ఒకేసారి ముంచుకురావడంతో జేబులకు పెద్ద ఎత్తున చిల్లులు పడుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మిడిల్ క్లాస్ ఇళ్లలో స్కూలు ఫీజులు, రైతులైతే పెట్టుబడి ఖర్చుల గురించి ఆలోచనలు చేస్తున్నారు.

జూన్ నెల రాగానే తల్లిదండ్రులను పట్టి పీడించే ప్రధాన సమస్య స్కూల్ రీ-ఓపెనింగ్స్, అడ్మిషన్ల ఫీజులు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ ఏటా 10 శాతం నుండి 15 శాతం వరకు పెరు...