భారతదేశం, మార్చి 14 -- రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరులోగా లక్ష ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేస్తామని దేవాదాయ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఫ్లాగ్‌షిప్ హౌసింగ్ స్కీమ్‌లోని రెండో దశలో, రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో మరో రౌండ్ ఇందిరమ్మ ఇళ్లను చేపడుతుందని, అర్హులైన పేదలందరికీ రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తామని మంత్రి తెలిపారు.

ఇటీవల ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో పలు రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. రెండు పర్యాయాలు రాష్ట్రాన్ని అధికారంలోకి తెచ్చిన బీఆర్‌ఎస్‌ పాలకులు ఇళ్లులేని పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను అందజేస్తామన్న హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ఏడాది 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందన్నారు. పేదల సొంతింటి కల...