భారతదేశం, జూలై 8 -- భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో మరోసారి అలజడి సృష్టించాయి. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న ఘర్షణల నేపథ్యంలో బుధవారం భారత స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న బలహీన సంకేతాలు, ముడిచమురు ధరల పెరుగుదల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి.

సింగపూర్‌ వేదికగా సాగే గిఫ్ట్ నిఫ్టీ (Gift Nifty) బుధవారం ఉదయం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. నిఫ్టీ ఫ్యూచర్స్ క్రితం ముగింపుతో పోలిస్తే దాదాపు 205 పాయింట్ల నష్టంతో 24,235 స్థాయి వద్ద ట్రేడవుతోంది. ఇది దేశీయ సూచీలు భారీ గ్యాప్-డౌన్‌తో ప్రారంభం కానున్నాయని సూచిస్తోంది. అంతకుముందు మంగళవారం నాటి ట్రేడింగ్‌లో దేశీయ మార్కెట్ల నాలుగు రోజుల లాభాల పరంపరకు బ్రేక్ పడింది. లాభాల స్వీకర...