మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్.. బొగ్గు బ్లాకుల కేటాయింపు కేసులో తీర్పు
భారతదేశం, జూలై 29 -- యూపీఏ (UPA) హయాంలో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన బొగ్గు బ్లాకుల కేటాయింపుల వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో మాజీ ప్రధాని, దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్కు అత్యున్నత న్యాయస్థానం నిర్దోషిగా క్లీన్ చిట్ ఇచ్చింది. 2015లో ప్రత్యేక సీబీఐ కోర్టు ఆయనకు జారీ చేసిన సమన్లను రద్దు చేస్తూ, కేసును విచారించాల్సిన ఆవశ్యకత లేదని స్పష్టం చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
సీబీఐ జరిపిన విచారణలో మన్మోహన్ సింగ్పై ఎలాంటి నేరపూరిత ఆధారాలు లేవని తేలుస్తూ రెండుసార్లు క్లోజర్ రిపోర్టులు దాఖలు చేసింది. అయినా కూడా ప్రత్యేక ట్రయల్ కోర్టు సీబీఐ క్లోజర్ రిపోర్టులను తోసిపుచ్చి మన్మోహన్ సింగ్ను న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.