భారతదేశం, జూన్ 23 -- రైలు ప్రయాణం చేసే మహిళలకు కేంద్ర ప్రభుత్వం, ప్రముఖ టెలికాం మౌలిక సదుపాయాల సంస్థ ఇండస్ టవర్స్ (Indus Towers) పెద్ద ఉపశమనం కలిగించాయి. మహిళల ఆరోగ్యం, పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంతో నార్తర్న్ రైల్వేస్‌తో కలిసి ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. 'నారీ సమ్మాన్' అనే కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) పథకం కింద ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో మహిళా ప్రయాణికులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లను అందిస్తున్నారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీ, ఫిరోజ్‌పూర్, అంబాలా, మొరాదాబాద్, లక్నో డివిజన్ల పరిధిలోని 175 రైల్వే స్టేషన్లలో మొత్తం 500 శానిటరీ నెప్కిన్ వెండింగ్ మిషన్లను విజయవంతంగా అందుబాటులోకి తెచ్చారు. ఈ మిషన్లను సరికొత్త ఐఓటీ (IoT - ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) సాంకేతికతతో అనుసంధానించడం విశేషం. దీనివల్ల మిషన్లలో ప్యాడ్ల నిల్వలను ఎప్...