భారతదేశం, ఏప్రిల్ 30 -- అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న కీలక నిర్ణయం భారత పసిడి మార్కెట్‌పై ప్రభావం చూపాయి. గురువారం ఉదయం ఎంసీఎక్స్ (MCX) మార్కెట్‌లో బంగారం ధరలు లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను 3.5% నుంచి 3.75% శ్రేణిలో మార్చకుండా అలాగే ఉంచడం (Status Quo) మదుపరులకు కలిసి వచ్చింది.

గురువారం ఉదయం 9:05 గంటల సమయంలో, ఎంసీఎక్స్ జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.25% పెరిగి రూ. 1,49,420 (ప్రతి 10 గ్రాములకు) వద్ద ట్రేడ్ అవుతోంది. పసిడి బాటలోనే వెండి కూడా పరుగులు తీస్తోంది. జూలై వెండి ఫ్యూచర్స్ 0.71% లాభంతో కిలోకు రూ. 2,39,950 వద్ద కొనసాగుతోంది. అయితే, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరడం పసిడి లాభాలను కొంతమేర కట్టడి చేస్తోంది.

వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను యథ...