భారతదేశం, మే 20 -- మరణం తర్వాత ఏం జరుగుతుందనేది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే బతికి ఉన్నవాళ్లకు దీని సమాధానం తెలియదు కాబట్టి. కానీ గరుడ పురాణంలోని ప్రేత ఖండంలో చెప్పినట్లుగా మరణం తర్వాత కొన్ని గంటలలో ఆత్మకు చాలా విషయాలు అర్థం అవుతాయ్. సంపాదన, బంధుత్వం, నాది-నీది.. ఇలా చాలా విషయాలపై క్లారిటీ వస్తుంది.

ఒక మనిషి చనిపోయిన తర్వాత శ్మశానంలో చితికి నిప్పంటించి అందరూ తిరిగి వస్తారు. ఇక అక్కడ మిగిలేది కేవలం బూడిద, నిశ్శబ్దం, చనిపోయిన వ్యక్తి ఆత్మ మాత్రమే. ఎన్నో ఏళ్లుగా తాను ప్రేమించి, అలంకరించుకుని, అద్దంలో గర్వంగా చూసుకున్న తన శరీరం కేవలం బూడిదగా మారిపోతుంది. అందం అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. ఈ సమయంలో తన శరీరం కాలిపోవడాన్ని చూసి ఆత్మ బాధపడుతుంది. అగ్ని వేడికి అది తిరిగి శరీరంలోకి ప్రవేశించలేకపోతుందని గరుడ పురాణం చెబుతోంది. ఈ భౌతిక ప్రపంచంలో ...