భారతదేశం, ఫిబ్రవరి 20 -- టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్‌టైనర్‌గా యంగ్ హీరో శ్రీవిష్ణు పేరు తెచ్చుకున్నాడు. వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతున్న శ్రీవిష్ణు మృత్యుంజయ్, విష్ణు విన్యాసం రెండు సినిమాలతో అలరించేందుకు రెడీగా ఉన్నాడు.

అయితే, ఇటీవల థియేట్రికల్ రిలీజ్‌కు రెండు రోజులో ముందు నిర్వహించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హీరో శ్రీవిష్ణు హాజరయ్యాడు. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. "యూవీ మూవీ అంటే నా సొంత సినిమాలా భావిస్తా. నేను ఈ సంస్థలో ఒక మూవీ చేశాను. ఈ బ్యానర్‌లో అన్నీ బాగుంటాయి. మనల్ని ఎంతగానో లవ్ చేస్తారు" అని అన్నారు.

"గోల్కొండ హైస్కూల్ సినిమా నుంచే సంతోష్ యాక్టింగ్ అంటే నాకు ఇష్టం. మంచి పర్‌ఫార్మర్. నేచురల్‌గా నటిస్తాడు. సినిమాల్ల...