భారతదేశం, మే 18 -- వంట నూనెగా మనం వాడుతున్న పామ్ ఆయిల్, ఇప్పుడు ఇంధనంగా (Biodiesel) మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా పామ్ ఆయిల్ ఎగుమతుల్లో ఇండోనేషియా, మలేషియాలదే అగ్రస్థానం. ఈ రెండు దేశాలు తమ పెట్రోల్, డీజిల్ దిగుమతులను తగ్గించుకోవడానికి పామ్ ఆయిల్ ను భారీగా బయో-డీజిల్ తయారీకి మళ్లించాలని నిర్ణయించాయి. ముఖ్యంగా ఇండోనేషియా జూలై 1 నుంచి 'B50' విధానాన్ని అమలు చేయబోతోంది. అంటే డీజిల్‌లో 50 శాతం పామ్ ఆయిల్ కలుపుతారు. దీనివల్ల ఆ దేశం నుంచి మనకు వచ్చే ఎగుమతులు భారీగా తగ్గిపోనున్నాయి.

మన దేశం తన వంట నూనె అవసరాల్లో 55 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో సింహభాగం పామ్ ఆయిల్‌దే. దీనికి ప్రధాన కారణం ఇది సోయాబీన్ లేదా సన్‌ఫ్లవర్ ఆయిల్ కంటే చౌకగా దొరకడమే.

2025 గణాంకాల ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో ఒక టన్ను పామ్ ఆయిల్ ధర సుమారు 997 డాలర్లు ఉం...