భారతదేశం, జూన్ 22 -- Bhupalpally DTO Venkanna Road Accident : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం అత్యంత విషాదకరమైన ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విధి నిర్వహణలో భాగంగా రోడ్డుపై వాహనాలను తనిఖీ చేస్తున్న జిల్లా రవాణా అధికారి (DTO) వెంకన్నను ఒక బొగ్గు టిప్పర్ బలితీసుకుంది. ఈ ప్రమాదంలో ఆయన శరీరం నుజ్జునుజ్జయి తీవ్ర క్షతగాత్రుడిగా మారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పరకాల - భూపాలపల్లి ప్రధాన రహదారిపై ఉన్న జిల్లా రవాణా అధికారి కార్యాలయం ముందే ఈ దారుణం జరిగింది. రవాణా శాఖకు చెందిన సిబ్బందితో కలిసి డీటీఓ వెంకన్న కార్యాలయం ముందు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పరకాల వైపు నుంచి భూపాలపల్లి వైపు వస్తున్న ఒక బొగ్గు టిప్పర్ అతివేగంగా దూసుకొచ్చింది. అధికారులు ఆపేందుకు ప్...