భారీ వర్ష హెచ్చరిక.. ఆఫీసు నుంచి ముందుగానే బయటకు వెళ్లాలని పోలీసులు సూచన
భారతదేశం, జూన్ 22 -- ఉద్యోగులకు సైబరాబాద్ పోలీసులు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. 2026, జూన్ 22వ తేదీ సోమవారం సాయంత్రం నగరంలో మోస్తరు నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రోడ్లపై తీవ్రమైన ట్రాఫిక్ జామ్లు ఏర్పడకుండా, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ఒక అధికారిక 'వెదర్ అలర్ట్ అండ్ ట్రాఫిక్ అడ్వైజరీ'ని విడుదల చేసింది.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విడుదల చేసిన ఈ అడ్వైజరీ ప్రకారం... గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, చందానగర్ వంటి ఐటీ హబ్లలో పనిచేసే కంపెనీలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలు తమ ఉద్యోగులకు విడతల వారీగా మధ్యాహ్నం 3:30 గంటల నుంచే ముందస్తు లాగౌట్ సౌకర్యం కల్పించాలని కోరారు. దీనివల్ల రోడ్లపై ట్రాఫిక్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.