భారతదేశం, ఫిబ్రవరి 27 -- నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) గణాంకాల ప్రకారం, ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతున కదలికలు సంభవించాయి. దీని కేంద్రం పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో (22.57degN అక్షాంశం, 89.11degE రేఖాంశం) ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
మరోవైపు, అమెరికా భూగర్భ సర్వే సంస్థ (USGS) ఈ భూకంప తీవ్రతను 5.3గా పేర్కొంది. పశ్చిమ బెంగాల్లోని టాకీ పట్టణానికి ఆగ్నేయంగా 26 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్జీఎస్ వెల్లడించింది.
భూకంపం వచ్చిన సమయంలో ప్రకంపనలు చాలా తీవ్రంగా ఉన్నాయని కోల్కతా వాసులు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. "నా జీవితంలో తొలిసారి ఇలాంటి ప్రకంపనలు అనుభవించాను" అని ఒకరు 'X' (గతంలో ట్విట్టర్) లో పేర్కొనగా, "కోల్కతాలో భయంకరమైన ప్రకంపనలు వచ్చినట్టు అనిపించి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.