భారతదేశం, మార్చి 18 -- భారతదేశ భద్రతకు ముప్పు కలిగించేలా విదేశీయులు కుట్ర పన్నడం కలకలం రేపుతోంది. మయన్మార్‌లోని ఉగ్రవాద గ్రూపులకు శిక్షణ ఇస్తూ, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో అమెరికన్ పౌరుడు మాథ్యూ ఆరోన్ వాన్‌డైక్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేసింది. ఈయనతో పాటు ఆరుగురు ఉక్రెయిన్ పౌరులను కూడా మార్చి 13న అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పర్యాటక వీసాలపై భారత్‌లోకి ప్రవేశించి, అక్రమంగా సరిహద్దులు దాటి ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించడం దేశ భద్రతా వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్‌కు చెందిన మాథ్యూ వాన్‌డైక్ ఒక సాధారణ పౌరుడు కాదు. ఆయన వెబ్‌సైట్ సమాచారం ప్రకారం.. ఆయన ఒక సైనికుడిగా, అంతర్జాతీయ వ్యాపారవేత్తగా, వార్ కరస్పాండెంట్‌గా పనిచేశారు.

మాథ్యూ వాన్‌డైక్‌తో పాటు హుర్బా పె...