భారతదేశం, జూన్ 10 -- భారత ఉన్నత విద్యా రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. జాతీయ విద్యా విధానం (NEP) 2020 ఆశయాలకు అనుగుణంగా, దేశీయంగా అంతర్జాతీయ స్థాయి విద్యను అందించేందుకు మూడు ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయాలకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అనుమతి పత్రాలను (Letters of Approval - LoAs) మంజూరు చేసింది. ఇందులో బ్రిటన్‌కు చెందిన రెండు, ఆస్ట్రేలియాకు చెందిన ఒక వర్సిటీ ఉన్నాయి. విదేశాలకు వెళ్లకుండానే భారతీయ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు యూజీసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేయబోతున్న ఆ మూడు విదేశీ యూనివర్సిటీల వివరాలు ఇవే:

"ఈ మూడు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల రాక.. ఎన్‌ఈపీ 2020లో పేర్కొన్న విద్యా అంతర్జాతీయకరణ (Internationalisation of E...