భారతదేశం, జూలై 24 -- హైదరాబాద్ నగరం వేదికగా ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి (BGUS) సర్వం సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది 47వ సామూహిక గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 14న వినాయక విగ్రహాల ప్రతిష్టాపనతో ప్రారంభమై సెప్టెంబర్ 25న అనంత చతుర్దశి పర్వదినాన శోభాయాత్ర, మహానిమజ్జనంతో ముగుస్తాయని ఉత్సవ సమితి అధికారికంగా ప్రకటించింది.

ఈ సంవత్సరం నిర్వహించే నవరాత్రి వేడుకలు అనేక చారిత్రక, సాంస్కృతిక ఘట్టాల కలయికగా నిలవనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాల్లో క్రింది ప్రముఖ ఘట్టాలను స్మరించుకోనున్నట్లు బీజీయూఎస్ అధ్యక్షుడు జి. రాఘవరెడ్డి, కార్యదర్శి రావినూతల శశిధర్ గురువారం వెల్లడించారు:

జాతీయ భావాన్ని రగిలించిన 'వందేమాతరం' గీతం 150వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. విశ్వహిం...