భారతదేశం, జూలై 25 -- నీట్-యూజీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని వారాలుగా నిరసనలు ఉధృతం చేసిన కాక్రోచ్ జనతా పార్టీకి ఈ వార్త ఉపశమనం కలిగించింది. శనివారం నిరసన ప్రదేశంలో ఉన్న CJP అధినేత అభిజీత్ దిప్కేకి ప్రధాన్ రాజీనామాకు సంబంధించిన ఫోన్ కాల్ రాగానే, ఆ వార్తను అక్కడ ఉన్న వేలాది మంది నిరసనకారులతో పంచుకున్నారు.

"మనం అనుకున్నది సాధించాం. ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. భయపడకుండా పోరాడితే విజయం సాధించవచ్చని ఈ పరిణామం నిరూపించింది" అని అభిజీత్ దిప్కే వేదికపై ప్రకటించగానే జంతర్ మంతర్ పరిసరాలు నినాదాలతో హోరెత్తాయి.

అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, దేశం ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తోదనడానికి ఈ రాజీనామా నిదర్శనమని, తమ సుదీర్ఘ పోరాటంలో ఇది కేవలం మొదటి విజయం మాత్రమేనని వ్...