భారతదేశం, జూన్ 13 -- పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం నడుస్తున్న తృణమూల్ కాంగ్రెస్ సంక్షోభంలో ఒక అనూహ్యమైన పేరు తెరపైకి వచ్చింది. ఆ పేరే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీఎం రమేష్. తెలుగు మాట్లాడే, ఒకప్పుడు టీడీపీలో ఉండి ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్న ఈ ఎంపీకి, బెంగాల్ టీఎంసీ ఎంపీలను కాషాయ గూటికి చేర్చడంలో ఏం సంబంధం? అనే ప్రశ్న ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ ఆపరేషన్ మొత్తానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌లు అధికారికంగా ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తున్నప్పటికీ.. తెరవెనుక ఉండి ఎక్కువ మంది టీఎంసీ నేతలకు ఫోన్లు చేసి సంప్రదింపులు జరిపింది మాత్రం వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడైన సీఎం రమేషే కావడం గమనార్హం.

ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తన పాత్రను అంగీకరిస్తూ సీఎం రమేష్ ఒక ఇంటర్వ్యూలో ఆస...