భారతదేశం, జూన్ 17 -- హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి రవాణా హబ్‌గా మార్చే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవాణా వ్యవస్థల విస్తరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రాజెక్టులపై దిశానిర్దేశం చేశారు.

హైదరాబాద్ నుండి ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు నిర్మించనున్న బుల్లెట్ ట్రైన్ కారిడార్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు ముఖ్యమైన సూచనలు చేశారు:

అనంతగిరి (వికారాబాద్): హైదరాబాద్-పూణే బుల్లెట్ ట్రైన్ మార్గంలో అనంతగిరి సమీపంలో కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలి.

భారత్ ఫ్యూచర్ సిటీ: హైదరాబాద్-బెంగళూరు హై-స్పీడ్ రైల్వే లైన్ కోసం 'భారత్ ఫ్యూచర్ సిటీ' వద్ద ప్రత్యేక స్టేషన్ ఉండాలి.

పర్యాటక ప్రాంతాలకు ప్రాధాన్యత: హైదరాబాద్-బెంగళూరు కారిడా...