భారతదేశం, ఏప్రిల్ 14 -- భారత రాజకీయాల్లో 'కింగ్ మేకర్'గా, బీహార్‌కు 'సుశాసన్ బాబు'గా పేరుగాంచిన నితీష్ కుమార్ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఒక ప్రధాన ఘట్టం ముగిసింది. మంగళవారం ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా, జేడీయూ (JD-U) మద్దతుతో బీజేపీ ఇప్పుడు డ్రైవింగ్ సీట్లోకి వచ్చింది. బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరిని ఎన్డీయే (NDA) కూటమి ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

బీజేపీ కేంద్ర పరిశీలకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో జరిగిన కీలక సమావేశంలో సామ్రాట్ చౌదరి పేరును ఖరారు చేశారు. విజయ్ కుమార్ సిన్హా ఈ ప్రతిపాదనను తీసుకురాగా.. రేణు దేవి, మంగళ్ పాండే, దిలీప్ జైస్వాల్ వంటి సీనియర్ నేతలు మద్దతు పలికారు. రాజధాని పాట్నాలోని లోక్ భవన్‌లో ఏప్రిల్ 15న సామ్రాట్ చౌదరి ముఖ్యమం...