భారతదేశం, ఏప్రిల్ 16 -- నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ప్రసంగించారు. కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలు చేస్తున్న ఆందోళనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

"డీఎంకే నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు. దక్షిణాదిలోని కొన్ని ప్రాంతీయ పార్టీలు ఎందుకు ఇంత ఆందోళన చేస్తున్నాయి.? వారు చిందిస్తున్న కన్నీళ్లు మొసలి కన్నీళ్లు. కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను రెండు భాగాలుగా విభజించింది. బ్రిటిష్ వాళ్లు దేశ విభజన చేసిన దాని కన్నా ఘోరంగా ఏపీని విభజించారు" అని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు.

విభజన సమయంలో తెలుగు ప్రజల సెంటిమెంట్లను, ఆర్థిక వనరులను కాంగ్రెస్ పట్టించుకోలేదని ఎంపీ తేజస్వీ సూర్య మాట్లాడారు. ఆ పాపం ఇప్పటికీ ఆ పార్టీని వెంటాడ...