భారతదేశం, జనవరి 6 -- బంగ్లాదేశ్లో అల్పసంఖ్యాక వర్గాలైన హిందువులపై హింసాత్మక ఘటనలు ఆందోళనకరంగా మారుతున్నాయి. తాజాగా యశోర్ (Jashore) ప్రాంతంలో ఓ హిందూ వ్యాపారవేత్త, జర్నలిస్టును దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. బంగ్లాదేశ్లో గత మూడు వారాల వ్యవధిలో హిందూ మతానికి చెందిన ఐదుగురు వ్యక్తులు వేర్వేరు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు.
హత్యకు గురైన రాణా ప్రతాప్ బైరాగి (38) యశోర్ జిల్లా కేశబ్పూర్ నివాసి. ఆయన నరైల్ నుంచి వెలువడే 'దైనిక్ బీడీ ఖబర్' (Dainik BD Khabar) అనే స్థానిక పత్రికకు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జర్నలిజంతో పాటు ఆయనకు మణిరాంపూర్లోని కొపాలియా బజార్లో ఒక ఐస్ ఫ్యాక్టరీ కూడా ఉంది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. గతంలో ఆయనపై కేశబ్పూర్, అభయ్నగర్ పోలీస్ స్టేషన్లలో కొన్ని కేసులు నమోదై ఉన్నాయి.
సోమవారం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.