భారతదేశం, మే 5 -- మన దేశంలో శుభకార్యం ఏదైనా, మదుపు చేయాలన్నా అందరికీ గుర్తొచ్చేది బంగారం. అయితే, ఫిజికల్ గోల్డ్ అనగానే భద్రత, స్వచ్ఛత, బ్యాంకు లాకర్ల ఖర్చులు వంటి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. వీటిని పరిష్కరిస్తూ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) సరికొత్త విప్లవానికి తెరలేపింది. మే 4న 'ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్' (EGRs) పేరుతో డిజిటల్ గోల్డ్ ట్రేడింగ్‌ను అధికారికంగా ప్రారంభించింది. అసలు ఈ ఈజీఆర్ అంటే ఏమిటి? ఇది సామాన్య పెట్టుబడిదారులకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం.

సరళంగా చెప్పాలంటే, మీరు కొనే బంగారానికి ఇచ్చే ఒక డిజిటల్ రసీదే ఈ ఈజీఆర్. సెబీ (SEBI) గుర్తింపు పొందిన వాల్ట్ మేనేజర్ల వద్ద భద్రపరిచిన ఫిజికల్ గోల్డ్ ఆధారంగా ఈ ఎలక్ట్రానిక్ రసీదులను జారీ చేస్తారు. వీటిని డీమ్యాట్ ఖాతాలో భద్రపరుచుకోవచ్చు. స్టాక్ మార్కెట్‌లో షేర్లను ఎలాగైతే కొం...