భారతదేశం, జనవరి 14 -- బుధవారం ఉదయం బులియన్ మార్కెట్ సరికొత్త చరిత్రను లిఖించింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు వీస్తుండటంతో దేశీయ కమోడిటీ మార్కెట్ (MCX)లో బంగారం, వెండి ధరలు మునుపెన్నడూ లేని విధంగా జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుండటంతో, ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు ఇన్వెస్టర్లను కొనుగోళ్ల వైపు నడిపిస్తున్నాయి.
జనవరి 14న ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు పరుగులు తీశాయి. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 0.50 శాతం లాభపడి 10 గ్రాములకు రూ. 1,42,938 వద్ద ట్రేడవుతోంది. అటు వెండి ధరలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా 2.60 శాతం జంప్ చేసి కిలో రూ. 2,82,351 మార్కును తాకింది. ఒక్కరోజే వెండి ధరలో ఇంతటి భారీ పెరుగుదల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.