భారతదేశం, ఏప్రిల్ 9 -- భారతదేశవ్యాప్తంగా ఉన్న శక్తి పీఠాల్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పండ్లు లేదా నైవేద్యాలు సమర్పించడం మనం చూస్తుంటాం. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లా, దట్టమైన అడవుల మధ్య కొలువై ఉన్న మా బాగదాయి ఆలయం వీటన్నింటికీ భిన్నం. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ అమ్మవారికి సమర్పించేది కేవలం ఐదు రాళ్లు, ఒక పువ్వు మాత్రమే!

శతాబ్దాల నాటి ఈ వింత ఆచారం వెనుక ఒక కథ ఉంది. స్థానిక కథనం ప్రకారం.. సుమారు వందేళ్ల క్రితం ఒక పేద గొర్రెల కాపరి అడవిలో దేవి విగ్రహాన్ని కనుగొన్నాడు. అమ్మవారు అతడి కలలోకి వచ్చి తనను అక్కడే ప్రతిష్టించాలని కోరింది.

అమ్మవారి ఆజ్ఞ ప్రకారం ఆ భక్తుడు చిన్న గుడిని నిర్మించాడు. అయితే, దేవికి సమర్పించడానికి అతడి వద్ద కొబ్బరికాయ గానీ, ఇతర ఖరీదైన వస్తువులు గానీ లేవు. తన పేదరికాన్ని తలచుకుని కన్నీరు మున్నీరైన ...