భారతదేశం, మే 17 -- పెట్‌బషీరాబాద్ పోలీసులు పోక్సో కేసులో బండి సాయి భగీరథ్‌ను అరెస్టు చేసి, ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం అతని ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం అతని కస్టడీని కోరాలని దర్యాప్తు అధికారులు యోచిస్తున్నారు. మే 8న ఒక మైనర్ బాలిక తల్లి దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు నమోదైన పోక్సో కేసులో శనివారం అరెస్టు అయ్యాడు బండి సాయి భగీరథ్. అతడి ఐఫోన్‌ను పెట్‌బషీరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తనపై కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న సాయి భగీరథ్‌ను శనివారం రాత్రి నర్సింగి సమీపంలోని అప్పా జంక్షన్ వద్ద సైబరాబాద్ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్స్ బృందం అరెస్టు చేసింది. సాయి భగీరథ్‌ను అదుపులోకి తీసుకున్న అనంతరం, అతడిని పెట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ పోలీసులు సుమారు రెండు గంటల పాటు విచారించి, అతని వాంగ్మూలాన్ని నమోదు చే...