భారతదేశం, జూలై 17 -- స్మార్ట్‌ఫోన్లు మన దైనందిన జీవితంలో ఒక అనివార్యమైన భాగమైపోయాయి. వ్యాపార పనులు, చదువు, సమాచార మార్పిడి, వినోదం.. ఇలా ప్రతిదానికీ ఫోన్ కావాల్సిందే. అయితే, గంటల తరబడి స్క్రీన్ల వైపు చూస్తూ గడపడం వల్ల మనకు తెలియకుండానే మెదడు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది.

ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే లక్షణాలు ఇప్పుడు యువతలో, టీనేజర్లలోనూ చూస్తున్నాం. స్మార్ట్‌ఫోన్లు నేరుగా నరాల సంబంధిత వ్యాధులకు కారణం కాకపోయినా, అతిగా వాడటం వల్ల ఏకాగ్రత, నిద్ర, జ్ఞాపకశక్తి, మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది.

మన మెదడు ఒక సమయంలో ఒకే పనిపై శ్రద్ధ పెట్టేలా నిర్మితమైంది. కానీ, ఫోన్లకు వచ్చే నోటిఫికేషన్లు, సోషల్ మీడియా అప్‌డేట్లు, అంతులేని రీల్స్ స్క్రోలింగ్ వల్ల మెదడు పదే పదే తన దృష్టిని మార్చుకోవాల్సి వస్తుంది.

దీనివల్ల కాలక్రమేణా కొన్ని సమస్...