భారతదేశం, ఆగస్టు 4 -- థాయిలాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా (AI2379) విమానంలో ఆందోళనకర సంఘటన చోటుచేసుకుంది. ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా తీవ్రమైన కుదుపులు ఎదురవ్వడంతో విమానం ఒక్కసారిగా ఊగిసలాడి ఎత్తు మారింది.

విమానం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయినప్పటికీ, ఈ కుదుపుల కారణంగా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. విమానం దిగిన వెంటనే విమానాశ్రయ వైద్య బృందం బాధితులకు ప్రాథమిక చికిత్స అందించింది.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ వసంత కుంజ్‌లోని ఫోర్టిస్ ఆసుపత్రి వర్గాలు వేగంగా స్పందించాయి. గాయపడిన ఏడుగురు ప్రయాణికులను ఆసుపత్రి అత్యవసర విభాగానికి (ER) తరలించారు. బాధితులకు తక్షణమే చికిత్స అందించేందుకు ఆసుపత్రి యాజమాన్యం 'కోడ్ ఎల్లో' (Code Yellow) ప్రోటోకాల్‌ను అమ...