భారతదేశం, జనవరి 30 -- కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. వైవాహిక జీవితంలో తలెత్తిన చిచ్చు చివరకు ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. కేవలం మూడు నెలల క్రితమే పెళ్లయిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి పారిపోవడంతో ఆమె భర్త, ఆ పెళ్లికి మధ్యవర్తిగా వ్యవహరించిన మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు.

గుమ్మనూరు గ్రామానికి చెందిన 30 ఏళ్ల యువకుడికి మూడు నెలల క్రితం వివాహమైంది. అయితే, గత సోమవారం ఆ యువతి 'గుడికి వెళ్తున్నాను' అని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి, తిరిగి రాలేదు. ఆమె తన ప్రియుడితో కలిసి పారిపోయిందని తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త సోమవారం సాయంత్రం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

విషాదం అక్కడితో ఆగలేదు. ఆ యువకుడి మరణవార్త విన్న 36 ఏళ్ల మరో వ్యక్తి (ఆమెకు బావ వరస అవుతాడు) కూడా ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడు అనేకొండ గ్రామాని...