భారతదేశం, జూన్ 16 -- రైలు ప్రయాణికులకు మరింత సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు దక్షిణ కోస్తా రైల్వే (SCoR) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యం ప్రయాణికుల రద్దీతో నడిచే ప్రతిష్టాత్మక సింహాద్రి ఎక్స్‌ప్రెస్, పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైళ్లను సాంప్రదాయ ఐసీఎఫ్ (ICF) కోచ్‌ల నుంచి అత్యాధునిక ఎల్‌హెచ్‌బీ (Linke Hoffmann Busch) కోచ్‌లుగా మార్చనున్నారు. ఈ ఆధునీకరణ ప్రక్రియ జూన్ 22 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు విజయవాడ డివిజన్ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

కొత్త కోచ్‌ల అమరిక పరిశీలిస్తే.. వీటిలో ఒక ఏసీ 3-టైర్ కోచ్, ఒక ఏసీ చైర్ కార్, ఆరు సెకండ్ క్లాస్ చైర్ కార్లు, పది జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, ఒక జనరేటర్ వ్యాన్, మరియు ఒక సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/బ్రేక్ వ్యాన్ అందుబాటులో ఉంటాయి.

దేశవ్యాప్తంగా ప్రయాణికులకు సురక్షితమైన, వేగవంత...