భారతదేశం, జూన్ 17 -- హైదరాబాద్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. రైల్వే మౌలిక సదుపాయాల ఆధునీకరణ, అత్యవసర ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా నగరంలోని పలు కీలక రూట్లలో సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 2026, జూన్ 20వ తేదీన (శనివారం) ఈ రద్దు వర్తిస్తుందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

కాచిగూడ-ధోన్ సెక్షన్ పరిధిలో జరుగుతున్న ఈ ట్రాక్ నిర్వహణ పనుల వల్ల కింది రెండు ప్రధాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. రైలు నెంబర్ 47222 (మేడ్చల్ - లింగంపల్లి) సాధారణంగా ఈ రైలు ప్రతిరోజూ ఉదయం 07:40 గంటలకు మేడ్చల్‌లో బయలుదేరి మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, బేగంపేట, హైటెక్ సిటీ మీదుగా ఉదయం 09:55 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. జూన్ 20న ఈ సర్వీస్ అందుబాటులో ఉండదు.

రైలు నెంబర్ 47252 (ఉమ్దానగర్ - సికింద్రాబాద్) రైలు ప్రతి...