భారతదేశం, మే 20 -- నార్వే రాజధాని ఓస్లోలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. నార్వే పత్రిక 'దగ్సావిసెన్' (Dagsavisen)కు చెందిన మహిళా జర్నలిస్ట్ హెల్లే లీంగ్, ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడమే కాకుండా, ఇప్పుడు ఆమె సోషల్ మీడియా ఖాతాల సస్పెన్షన్‌కు దారితీశాయి.

నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోరేతో కలిసి ప్రధాని మోదీ సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ముగించుకుని మోదీ వెళ్తుండగా, హెల్లే లీంగ్ స్పందిస్తూ.. "ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛా పత్రికా రంగం (నార్వే) నుంచి ప్రశ్నలు ఎందుకు తీసుకోరు?" అని ప్రశ్నించారు. ఈ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, "వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో నార్వే మొదటి స్థానంలో ఉంటే, భారత్ 157వ స్థానంలో ఉంది. పాలకు...