భారతదేశం, మే 14 -- Chandrababu Pawan Kalyan Convoy Reduce : పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించి. ఇంధన పొదుపును పాటించాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ వ్యక్తిగత భద్రతా వాహనాల శ్రేణి (కాన్వాయ్) విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రధాని మోదీ స్ఫూర్తితో ఇకపై తాము పర్యటించే సమయాల్లో కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 50 శాతానికి తగ్గించాలని అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతిలోనే కాకుండా.. జిల్లాల పర్యటనల సమయంలోనూ వాహనాల సంఖ్య సగానికి మించకూడదని స్పష్టం చేశారు. కేవలం తమకే కాకుండా మంత్రులు, ఇతర వీఐపీలు కూడా సాధ్యమైనంత తక్కువ వాహనాలను వినియోగించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగానికి దిశానిర్ద...