భారతదేశం, మే 14 -- ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక కుటుంబానికి చెందిన ప్రతీక్ యాదవ్ (ములాయం సింగ్ యాదవ్ కుమారుడు) ఆకస్మిక మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బుధవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే, ఆరోగ్యంగా కనిపించే ప్రతీక్ ఒక్కసారిగా ఎలా మరణించారనే సందేహాలకు తాజా పోస్ట్‌మార్టం నివేదిక సమాధానమిచ్చింది. 'హిందుస్థాన్ టైమ్స్' సేకరించిన సమాచారం ప్రకారం.. ఆయన మరణానికి ప్రధాన కారణం ఊపిరితిత్తుల్లో భారీగా రక్తం గడ్డకట్టడమే (Massive Pulmonary Thromboembolism).

వైద్య పరిభాషలో దీనిని అత్యంత ప్రమాదకరమైన స్థితిగా పరిగణిస్తారు. ప్రతీక్ యాదవ్ శరీరంలో రక్తం గడ్డకట్టి, ఆ గడ్డలు రక్తప్రవాహం ద్వారా ప్రయాణించి ఊపిరితిత్తుల్లోని ధమనులను (Arteries) పూర్తిగా మూసివేసినట్లు శవపరీక్షలో తేలింది. దీనివల్ల ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరా న...