భారతదేశం, సెప్టెంబర్ 20 -- సనాతన ధర్మంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు, శుభకార్యాలు లేదా పూజల సమయంలో కొబ్బరికాయను కొట్టడం అనేది చాలా పురాతనమైన, ముఖ్యమైన ఆచారం. సంస్కృతంలో దీనిని శ్రీఫల అని అంటారు. పూజల సమయంలో కొబ్బరికాయను కొట్టడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. దాని వెనక గొప్ప విషయం దాగి ఉంది.

నమ్మకాల ప్రకారం.. మానవాళి శ్రేయస్సు కోసం విష్ణుమూర్తి మహాలక్ష్మి దేవిని, కామధేనువును, పవిత్రమైన కొబ్బరి చెట్టును భూమిపైకి తీసుకువచ్చారు. కొబ్బరికాయపై ఉండే మూడు కన్నులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పవిత్ర త్రిమూర్తులను సూచిస్తాయి.

హిందూ ఆచారాలలో కొబ్బరి నీటికి గొప్ప శుద్ధీకరణ ప్రాముఖ్యత ఉంది . తాజా కొబ్బరి నీటిని చల్లడం లేదా సమర్పించడం వల్ల ఇంటి నుండి ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్మకం. చిన్నపాటి నిర్మాణ లోపాలు సరిదిద్దబడతాయని, నివాస స్థలానికి శా...