భారతదేశం, ఫిబ్రవరి 4 -- వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దేశ చరిత్రలో తొలిసారిగా ఒక పదవిలో ఉన్న ముఖ్యమంత్రి స్వయంగా సుప్రీం కోర్టుకు వెళ్లి తన వాదనలు వినిపించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) పేరుతో లక్షలాది మంది సామాన్యుల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. "ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. ప్రజల జీవితాలను కాపాడండి" అంటూ ఆమె అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
ముఖ్యమంత్రి దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టిన భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పాంచోలిలతో కూడిన ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) నోటీసులు జారీ చేసింది. చిన్న చిన్న కారణాలతో జారీ చేసిన నోటీసులను ఎందుకు ఉపసంహరించుక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.