భారతదేశం, మే 15 -- దేశంలో మే 20వ తేదీన మెడికల్ షాపులు బంద్ ఉంటాయి. సుమారు 12.40 లక్షలకుపైగా కెమిస్టులు, ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్లు పాల్గొంటారని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలు, ఫార్మాస్యూటికల్ వ్యాపారానికి సంబంధించిన ఇతర సమస్యలపై 2026 మే 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్‌కు పిలుపునిచ్చారు.

మధుమేహం, అధిక రక్తపోటు, ఆస్తమా, గుండె జబ్బులు, మూర్ఛ, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు అవసరమైన మందులను ముందుగానే కొనుగోలు చేసి, తగినంత నిల్వ ఉంచుకోవాలని సంఘం సూచించింది. అత్యవసర మందులు, ఇన్సులిన్, ఇన్హేలర్లు, పిల్లల మందులు, ఇతర ప్రాణరక్షణ మందులను అందుబాటులో ఉంచుకోవాలని పౌరులకు అఖిల భారత ఔషధ వ్యాపారుల సంఘం విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో భయాం...