భారతదేశం, జూన్ 7 -- పోలవరం జిల్లా దేవీపట్నం మండలం పాత నేలకోట గ్రామ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తూ కనిపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అంతేకాదు ఈ ప్రాంతంలో థర్మల్ డ్రోన్ కెమెరాకు పులి చిక్కింది. ఈ క్రమంలోనే అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై, పులిని సురక్షితంగా బంధించడానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పూడిపల్లి-నేలకోట మధ్యన కొండ ప్రాంతంలో ఉన్నట్టుగా గుర్తించారు.

పులి కదలికలపై నిరంతర నిఘా ఉంచిన అధికారులు, దానిని పట్టుకునేందుకు అత్యాధునిక సాంకేతికతను, నిపుణుల బృందాలను రంగంలోకి దించారు. పులిని ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా పట్టుకునేందుకు ప్రత్యేక వన్యప్రాణి నిపుణుల బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 150 మందితో కూడిన హనుమాన్ రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. పులిని బంధించేందుకు అత్యాధునిక రక్షణ సామాగ్రిన...