భారతదేశం, మే 18 -- Twisha Sharma Family Protest At CM Home Over Dowry Death: మాజీ మిస్ పుణె, నోయిడాకు చెందిన ట్విషా శర్మ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని తన అత్తవారింట్లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. మే 12న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్విషా శర్మ మరణం వెనుక అత్తమామల వరకట్న వేధింపులు, దారుణమైన హత్య కోణం ఉన్నాయని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మోడలింగ్ రంగంలో రాణించిన ట్విషా శర్మకు 2024లో ఒక డేటింగ్ యాప్ ద్వారా భోపాల్‌కు చెందిన లాయర్ సమర్థ్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, 2025 డిసెంబర్‌లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన 5 నెలలకే ఆమె జీవితం నరకప్రాయంగా మారింది. సమర్థ్ సింగ్ తల్లి గిరిబాల సింగ్ గతంలో న్యాయమూర్తిగా పనిచేశారు. చట్టాన్ని గౌరవించాల్సిన పెద్దల ఇంట్లోనే ఒక నిండ...