భారతదేశం, ఏప్రిల్ 25 -- తెలంగాణలో భూమి, నివాస, వాణిజ్య భవనాల మార్కెట్ విలువను పెంచిన రేట్లతో సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పెంపులు మే మొదటి వారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. సచివాలయంలో జరిగిన రెవెన్యూ సమీకరణపై కేబినెట్ ఉపసంఘం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూమి మార్కెట్ విలువలను సవరించడం ఇదే మొదటిసారి. కాగా గతంలో 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ సవరణ జరిగింది.
పెంపు పరిమాణాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, అపార్ట్మెంట్ల మార్కెట్ విలువను కొద్దిగా పెంచుతూ, వాణిజ్య భవనాల విలువను స్వల్పంగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ప్రాంతాన్ని బట్టి వ్యవసాయ భూమి మార్కెట్ విలువ రెండు నుంచి మూడు రెట్లు పెరుగుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. చాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.