భారతదేశం, మార్చి 25 -- న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత ఇంధన మార్కెట్‌ను తాకాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై జరిగిన దాడుల తర్వాత హార్ముజ్ జలసంధి మూతపడటంతో, ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకం కలిగింది. ఈ క్రమంలో భారత్‌లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడవచ్చని, మళ్లీ 'లాక్‌డౌన్' తరహా ఆంక్షలు వస్తాయని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు కలకలం రేపాయి. అయితే, వీటిపై ప్రభుత్వ రంగ చమురు సంస్థలు బుధవారం కీలక ప్రకటన చేశాయి.

పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో BPCL, HPCL సంస్థలు స్పందించాయి:

అంతకుముందు సోమవారం, మంగళవారం పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం చర్చనీయాంశమైంది. యుద్ధం వల్ల ప్రపంచ ఇంధన సరఫరాకు తీవ్ర విఘాతం కలిగిందని, దీనివల్ల దీర్ఘకాలిక దుష్ప్రభావాలు తప్పవని ఆయన హెచ్చరించారు.

"చమురు, గ్యాస్ లేదా ఎ...