భారతదేశం, మే 29 -- సొంత ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని, కరెంటు బిల్లుల భారం నుంచి విముక్తి పొందాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫిబ్రవరి 2024లో ప్రారంభమైన 'పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన' ప్రస్తుతం దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది. కేవలం విద్యుత్ ఆదా చేయడమే కాకుండా, మిగులు విద్యుత్తును గ్రిడ్‌కు విక్రయించి ఆదాయం పొందే వెసులుబాటు కూడా ఈ పథకం కల్పిస్తోంది. న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ (MNRE) గణాంకాల ప్రకారం.. మార్చి 19, 2026 నాటికి దేశవ్యాప్తంగా ఇప్పటికే 26.19 లక్షలకు పైగా గృహాల్లో సోలార్ వ్యవస్థలను విజయవంతంగా ఏర్పాటు చేశారు.

గృహ వినియోగదారులకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను అమర్చుకోవడం ద్వారా విద్యుత్తును ఉత...