భారతదేశం, మే 7 -- పిల్లల పేరిట చిన్నప్పటి నుంచే పొదుపు అలవాటును పెంచడం, వారు 18 ఏళ్లు నిండాక ఆ నిధిని సాధారణ ఎన్‌పీఎస్ ఖాతాగా మార్చుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే, తాజా గణాంకాల ప్రకారం కేవలం 2,25,000 అకౌంట్లు మాత్రమే ఓపెన్ అయ్యాయి. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటానే సింహభాగం. ప్రభుత్వ బ్యాంకుల్లో 68,042 అకౌంట్లు తెరుచుకోగా, అందులోనూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 22,646 ఎన్‌రోల్‌మెంట్లతో అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుస స్థానాల్లో ఉన్నాయి.

మరోవైపు, ప్రైవేటు రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకులు ఈ విషయంలో చాలా వెనకబడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI) కేవలం 4,023 అకౌంట్లను మాత్రమే నమోదు చేయగా, హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) 2,836, యాక్సిస్ బ్యాంక్ 2,433 అకౌంట్లకే పరిమితమయ్యాయి. వికసిత్ భ...